ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 11, 2021, 9:43 PM IST

ETV Bharat / state

'కొవిడ్‌ చికిత్స కేంద్రంతో పాటు.. ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేయాలి'

కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేయాలని తహసీల్దారు ప్రేమంతకుమార్‌ను భాజపా నాయకులు కోరారు. ఈ మేరకు వినతిపత్రం అందించారు.

bjp leaders
వినతిపత్రం అందిస్తున భాజపా నేతలు

కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. కొవిడ్‌ చికిత్స కేంద్రంతో పాటు.. ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేయాలని భాజపా నాయకులు కోరారు. వైరస్​ సోకి... హోమ్ ఐసోలేషన్​లో ఉన్న వారికి సరైన వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. శాశ్వత కొవిడ్‌ పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు.

కొవిడ్‌ బాధితులు వైద్యం కోసం కడప, ప్రొద్దుటూరు పట్టణాలతో పాటు కర్నూలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఈ మేరకు పార్టీ జిల్లా కార్యదర్శి పి.శ్రీధర్ బాబు, జాతీయ మాజీ కౌన్సిల్ సభ్యుడు బీపీ వెంకట ప్రతాపరెడ్డి మైదుకూరు తహసీల్దారు ప్రేమంతకుమార్‌కు వినతిపత్రం అందజేశారు. వెంటనే విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details