ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 3, 2021, 9:42 PM IST

ETV Bharat / state

'తెదేపా పరిషత్ ఎన్నికలను బహిష్కరించడం విడ్డూరంగా ఉంది'

తెలుగుదేశం పార్టీ పరిషత్ ఎన్నికలను బహిష్కరించడం విడ్డూరంగా ఉందని.. వైకాపా నేత రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు. తెదేపా ప్రస్తుతం ఎలాంటి పరిస్థితిలో ఉందో అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. కడప జిల్లా జమ్మలమడుగులో ఆయన మీడియాతో మాట్లాడారు.

రామసుబ్బారెడ్డి
రామసుబ్బారెడ్డి

తెదేపా అధినేత చంద్రబాబు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించడం విడ్డూరంగా ఉందని.. 40 ఏళ్ల చరిత్ర గల పార్టీ ఎటువంటి పరిస్థితిలో ఉందో అర్థమవుతుందని మాజీమంత్రి, వైకాపా నేత రామసుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. కడప జిల్లా జమ్మలమడుగు వైకాపా కార్యాలయంలో రామసుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. జగన్ సంక్షేమ పథకాలకు ప్రజలు పట్టం కట్టారని... ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించామని గుర్తు చేశారు. తెదేపా నాయకులకు ఎప్పుడు చూసినా జగన్​ని తిట్టడం తప్ప మరో పని లేదని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details