ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'ప్రొద్దుటూరు క్వారంటైన్​కు 14 మంది తరలింపు'

By

Published : Apr 3, 2020, 11:12 AM IST

ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన 21 మంది రక్త నమూనాలను తిరుపతికి పంపగా.... ఏడుగురికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధరణ అయ్యింది. మిగిలిన 14 మందిని స్థానిక ప్రభుత్వ పశు వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్​ సెంటర్​కు తరలించారు.

ప్రొద్దుటూరు క్వారంటైన్​కు 14 మంది తరలింపు
ప్రొద్దుటూరు క్వారంటైన్​కు 14 మంది తరలింపు

కడప జిల్లా ప్రొద్దుటూరులోని ప్రభుత్వ పశు వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్​కు 14 మందిని తరలించారు. ఇటీవల పట్టణానికి చెందిన 21 మంది రక్త నమూనాలను అధికారులు తిరుపతికి పంపారు. అందులో 7గురికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధరణ కాగా మిగిలిన 14 మందికి నెగిటివ్ అని తేలింది. ముందస్తు చర్యల్లో భాగంగా నెగిటివ్ వచ్చిన వ్యక్తులను క్వారంటైన్​కు తరలించారు. జిల్లా మొత్తంగా క్వారంటైన్​లో ఉన్న వారి సంఖ్య 44కు చేరింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details