ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నలుగురు దొంగల అరెస్ట్... 37 దుంగలు స్వాధీనం...

కడప జిల్లా మైదుకూరు మండలం నల్లమల అటవీ ప్రాంతంలోని నలుగురు స్మగ్లర్లను అటవీ అధికారులు పట్టుకోగా, వీరి వద్దనుండి ముప్పైఏడు ఎర్రచందనదుంగలను,మూడు బైకులను స్వాధీనం చేసుకున్నారు.

By

Published : Jul 25, 2019, 2:48 PM IST

police arrested sandalwood smaglors at kadapa district

కడప జిల్లా మైదుకూరు మండలం గంజికుంట ఎగువ భాగంలో ని నల్లమల అటవీ ప్రాంతంలోని చెలిమి బావి వద్ద బ్రహ్మంగారి మఠం మండలానికి చెందిన నలుగురు స్మగ్లర్లను వనిపెంట అటవీ క్షేత్ర అధికారులు అరెస్టు చేశారు. వీరి వద్దనుండి ముప్పైఏడు ఎర్రచందనదుంగలను,మూడు బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమరవాణాపై సమాచారం అందుకోవడంతతో తనిఖీలు నిర్వహించగా, పదకొండు మంది స్మగ్లర్లు పారిపోయే ప్రయత్నం చేయగా నలుగురిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేసారు. వారిని విచారణ నిమిత్తం కోర్టులో హాజరుపరుచనున్నారు.

నలుగురు స్మగ్లర్ల అరెస్ట్..37 ఎర్రచందనదుంగలు స్వాధీనం...

ABOUT THE AUTHOR

...view details