ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 8, 2020, 6:18 PM IST

ETV Bharat / state

రైలు కిందపడి గుర్తు తెలియని వృద్ధుడు మృతి

రైల్వే కోడూరు మండలం సెట్టిగుంట సమీపంలో రైలు పట్టాలపై గుర్తు తెలియని వృద్దుడు మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

రైలు కింద పడి గుర్తు తెలియని వృద్ధుడు మృతి
రైలు కింద పడి గుర్తు తెలియని వృద్ధుడు మృతి

కడప జిల్లా రైల్వేకోడూరు మండలం సెట్టిగుంట సమీపంలో రైలు పట్టాలపై గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందాడు. రైల్వే ఎస్సై రారాజు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం మధ్యాహ్నం సుమారు 60 సంవత్సరాల వయస్సు గల వృద్ధుడు రైలు కిందపడి చనిపోయాడు. కర్ణాటకకు చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం రేణిగుంట తరలించమని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రారాజు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details