ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 17, 2021, 1:59 PM IST

ETV Bharat / state

వైకాపా విజయంతో చంద్రబాబు శకం ముగిసినట్లైంది: ఎమ్మెల్సీ రామచంద్రయ్య

మున్సిపల్ ఎన్నికల్లో వైకాపా విజయంతో.. తెదేపా అధినేత చంద్రబాబు శకం ముగిసినట్లైందని ఎమ్మెల్సీ రామచంద్రయ్య విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను స్వాగతించాల్సిన ప్రతిపక్షం.. విమర్శలు చేయడమే పనిగా పెట్టుకుందని ఆక్షేపించారు.

mlc ramachandraiah fires on tdp chief chandrababu
'వైకాపా విజయంతో చంద్రబాబు శకం ముగిసినట్లైంది'

పురపాలక ఎన్నికల్లో వైకాపా భారీ విజయంతో తెదేపా అధినేత చంద్రబాబు శకం ముగిసినట్లైందని.. ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య విమర్శించారు. దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ మున్సిపాలిటీలన్నీంటినీ కైవసం చేసుకోలేదన్నారు. ఆ ఘనత వైకాపాదేనని చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను స్వాగతించాల్సిన ప్రతిపక్షం.. విమర్శలు చేయడమే పనిగా పెట్టుకుందని ఆక్షేపించారు. తెలుగుదేశం పని అయిపోయిందన్న ఆయన.. ఆ పార్టీ నాయకులు ఇక ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

'వైకాపా విజయంతో చంద్రబాబు శకం ముగిసినట్లైంది'

ABOUT THE AUTHOR

...view details