ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 3, 2019, 2:01 PM IST

ETV Bharat / state

ఆలయాల్లో ఎమ్మెల్యే రఘురాం రెడ్డి ప్రత్యేక పూజలు

సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి రావటం, ఎమ్మెల్యే విజయం సాధించటంతో మైదుకూరు ఎమ్మెల్యే రఘురాం రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

'ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే రఘురాం రెడ్డి'

'ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే రఘురాం రెడ్డి'

కడప జిల్లా మైదుకూరులోని పలు ఆలయాల్లో ఎమ్మెల్యే సెట్టిపల్లి రఘురాం రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా అధికారం చేపట్టడం, తాను ఎమ్మెల్యేగా విజయం సాధించటంతో... పెద్దమ్మ తల్లి, మాధవరాయ, భీమేశ్వర,ఆంజనేయ స్వామి ఆలయాల్లో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యే రఘురాం రెడ్డిని శాలువా కప్పి సన్మానించారు. వైకాపా పట్టణ అధ్యక్షుడు కేపీ లింగన్న ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో స్థానిక వైకాపా నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details