ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 10, 2020, 11:44 AM IST

ETV Bharat / state

253 మద్యం సీసాలు తరలిస్తున్న యువకులు అరెస్ట్​

కడప జిల్లా జమ్మలమడుగు ఎక్సైజ్ శాఖ అధికారులు భారీగా మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. శనివారం సాయంత్రం వాహనాల తనిఖీలో 253 మద్యం సీసాలను తీసుకెళ్తున్న ఆరుగురు యువకులను పట్టుకున్నారు. ఒక వాహనాన్ని జప్తు చేశారు.

liquor transporting people arrested in jammalamadugu
ఐధు కేసులు తీసుకెళ్తున్నయువకులను పట్టుకున్న ఎక్సైజ్​ అధికారులు

ప్రొద్దుటూరు నుంచి ఓ వాహనంలో కొంత మంది యువకులు ఐదు కేసుల మద్యాన్ని తరలిస్తుండగా పోలీసులు పసిగట్టారు. జమ్మలమడుగు శివారులో ఎక్సైజ్​ శాఖ అధికారులు రాధాకృష్ణ, చెన్నారెడ్డి వాహనాల తనిఖీ సందర్భంగా.. ఈ గుట్టును రట్టు చేశారు. మద్యం తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు.

సుమారు 70 వేల రూపాయలు విలువ చేసే 253 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని సీజ్​ చేశారు. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆంక్షలు అమలులో ఉన్న వేళ ఇలాంటి చర్యలను సహించేది లేదన్నారు.

ABOUT THE AUTHOR

...view details