ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 30, 2019, 6:36 PM IST

ETV Bharat / state

ట్రిపుల్ఐటీ విద్యార్థి ఆత్మహత్య... హాజరు కోసమేనా..?

ఇడుపులపాయ ఐఐఐటీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తానుండే హాస్టల్​ గదిలోనే ఫ్యాన్​కి ఉరి వేసుకొని చనిపోయాడు. హజరు సరిగ్గా లేదని చనిపోయాడా... లేక ఇతర కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

kadapa iedupulapaya iiit student attempted to sucide
ఇడుపులపాయ ట్రిపుల్ఐటీ విద్యార్థి ఆత్మహత్య

ట్రిపుల్ఐటీ విద్యార్థి ఆత్మహత్య... హాజరు కోసమేనా..?

కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్​ఐటీలో విషాదం జరిగింది. మెకానికల్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న మంజునాథ్ రెడ్డి అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ గదిలో ఫ్యాన్​కు ఉరి వేసుకుని చనిపోయాడు. విద్యార్థి స్వగ్రామం మైదుకూరు మండల కేంద్రంలోని గణపతి నగరమని తోటి విద్యార్థులు తెలిపారు. హాజరు తక్కువ ఉండటంతో పరీక్షలకు అనుమతించలేదని మనస్తాపంచెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details