క్షణికావేశంలో చేసిన నేరాలు ఆ తల్లులను... కన్న పిల్లలకు దూరం చేశాయి. పిల్లల ఆలనాపాలనా చూసుకునే సమయంలో జైలు పాలయ్యారు. కారాగారంలో అనుభవించే శిక్ష ఒక వైపు... తమ చిన్నారులు ఇంట్లో ఎలా ఉన్నారనే ఆలోచన మరోవైపు వారిని ఆవేదనకు గురిచేసింది. కడప కేంద్ర కారాగారంలో ఇలాంటి ముగ్గురు తల్లులు జైలు అధికారులకు తమ దుస్థితిని విన్నవించటంతో పిల్లల్ని తల్లుల వద్ద ఉండడానికి అధికారులు అనుమతిచ్చారు. పిల్లల ఆలనాపాలనా తల్లులే చూసుకుంటారు. ప్రతి ఉదయం ఆ చిన్నారులను మహిళా పోలీసులే బాలబడికి తీసుకువెళ్లి తిరిగి జైలుకు తీసుకువస్తున్నారు. చిన్నారులకు ఆరేళ్ల వయస్సు వచ్చే వరకు తల్లుల వద్ద ఉండవచ్చు. తర్వాత వారి బంధువులకు అప్పగిస్తారు. మహిళా కేంద్ర కారాగార సిబ్బంది ఆ ముగ్గురు పిల్లలను సొంత బిడ్డల్లా చూసుకుంటుండటం విశేషం.
ఇదీ చదవండి: