ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 11, 2020, 3:23 PM IST

ETV Bharat / state

శ్రమజీవుల పాదాలకు 'హెల్పింగ్ హ్యాండ్స్' క్షీరాభిషేకం

వారంతా పారిశుద్ధ్య కార్మికులు. కరోనా వ్యాప్తి నివారణకు నిరంతరం శ్రమిస్తున్నారు. గ్రామాల్లో, వీధుల్లో నిరంతరం వైరస్ నాశక రసాయనాలు పిచికారీ చేస్తూ.. కరోనా వ్యాప్తి చెందకుండా చూస్తున్నారు. కడపలో వారి సేవలను ప్రశంసించిన హెల్పింగ్​ హ్యాండ్స్​ సేవా సమితి సభ్యులు.. వారి పాదాలను పాలతో కడిగారు.

కరోనా నివారణకు కృషి చేస్తోన్న శ్రమజీవులకు క్షీరాభిషేకం
కరోనా నివారణకు కృషి చేస్తోన్న శ్రమజీవులకు క్షీరాభిషేకం

ప్రాణాలను లెక్కచేయక ప్రజారోగ్య సంరక్షణకు శ్రమిస్తున్న పురపాలిక కార్మికుల సేవలను ఎప్పటికీ మరువలేమని కడప డీఎస్పీ సూర్యనారాయణ అన్నారు. కార్యాలయం ఎదుట హెల్పింగ్‌ హ్యాండ్స్‌ సేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం కార్మికుల పాదాలను పాలతో కడిగి, సన్మానించారు. కరోనా వ్యాప్తి నివారణ కోసం పారిశుద్ద్య కార్మికులు రాత్రింబవళ్లు పని చేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో సేవా సమితి నిర్వాహకులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

బద్వేలులో రైతు బజారు ఏర్పాటుకు స్థల పరిశీలన

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details