కడప జిల్లాలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. మెున్నటి వరకు కేసులు లేని మండలాల్లో ఇప్పుడు కొవిడ్ విజృంభిస్తోంది. రాజుపాలెంలో ఆదివారం తొలి కరోనా కేసు నమోదైంది. బాధితుడు ఇటీవల మైలవరం మండలం నవాబుపేటలోని అత్తారింటికి వెళ్లిరావటంతో వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. అతనితో సన్నిహితంగా ఉన్న 50 మందిని గుర్తించారు.
రాజుపాలెంలో తొలి కరోనా కేసు నమోదు
ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉంటున్న ప్రాంతాల్లో కరోనా కోరలు చాస్తుంది. కడప జిల్లా రాజుపాలెంలో తొలి కరోనా కేసు నమోదు కావటంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాజుపాలెంలో తొలి కరోనా కేసు నమోదు