అడవిలో తిరగాల్సిన జింక గ్రామంలోకి వచ్చి ప్రాణాన్ని పోగొట్టుకుంది. కడప జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలోని ఓ ఇంటి వద్దకు వచ్చిన జింకపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు వచ్చి వైద్యం చేయించేందుకు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో జింక మృతి చెందింది.
కుక్కల దాడిలో జింక మృతి
అడవిలో ఆకులు తింటూ బతికే జింక పొరపాటున గ్రామంలోకి వచ్చింది. ఆ జింకను చూసిన కుక్కలు దానిపై దాడిచేసి చంపేశాయి. ఈ ఘటన కడప జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో జరిగింది.
dogs attack on deer and it was died in cadapa dst nandaloor mandal