ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 27, 2019, 10:57 PM IST

ETV Bharat / state

పరీక్షల్లో ఫెయిల్... బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

సెమిస్టర్ పరీక్షల్లో ఫెయిల్ అయి... మనస్తాపానికి గురైన బీటెక్ మూడో సంవత్సవరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కడప జిల్లా ప్రొద్దుటూరులోని వైఎంఆర్ కాలనీలో జరిగింది.

btech-student-suicide-in-kadapa-district
btech-student-suicide-in-kadapa-district

పరీక్షల్లో ఫెయిల్... బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

కడప జిల్లా ప్రొద్దుటూరు వైఎంఆర్ కాల‌నీలోని సాయికుటీర్ రోడ్డులో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో చంద్రఅఖిల చున్నీతో ఉరి వేసుకుంది. బీటెక్ మూడో సంవత్సరం సెమిస్టర్స్ పరీక్షా ఫలితాల్లో కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయింది. మనస్తాపం చెందిన... అఖిల‌ ఆత్మహత్యకు పాల్పడిన‌ట్లు పోలీసులు తెలిపారు. మృత‌దేహాన్ని ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details