ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 19, 2020, 3:59 PM IST

ETV Bharat / state

వంతెనపై భారీ గొయ్యి.. నిలిచిపోయిన రాకపోకలు

కడప జిల్లా కమలాపురం మండలం గొల్లపల్లె వద్ద వంతెనపై భారీ గొయ్యి పడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నాణ్యత లోపం కారణంగానే గొయ్యి పడిందన్నారు.

bridge damaged at gollapalli
వంతెనకు రంధ్రం

వంతెనకు రంధ్రం

కడప జిల్లా కమలాపురం మండలం గొల్లపల్లె వద్ద రాత్రి కురిసిన వర్షానికి వంతెనపై గొయ్యి పడింది. నిత్యం రద్దీగా ఉండే కడప, తాడిపత్రి రహదారికి రాకపోకలు నిలిచిపోయాయి. గతంలోనూ ఈ వంతెనకు ఇలాగే రంధ్రం పడిందని స్థానికులు చెబుతున్నారు. నాణ్యత లోపం వల్లే తరచుగా గోతులు పడుతున్నాయన్నారు. ప్రభుత్వం డబ్బులు వెచ్చించి.. నాణ్యత లోపం ఉన్న వంతెన నిర్మించడం ఏమిటని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా మరమ్మతులు త్వరితగతిన చేపట్టి రాకపోకలకు అంతరాయం కలగకుండా చూడాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details