గాంధీ, గాడ్సే వారసులకు మధ్య ఎన్నికల రణరంగం రాబోయే ఎన్నికల్లో కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ సీనియర్ నాయకులు తులసి రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గాంధీవారసులకు, గాడ్సే వారసులకు ఎన్నికల రణరంగం జరగబోతోందని ఆయన అన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో పరిపాలన దక్షులకు, పాలన చేతకాని వారికి మధ్య ఎన్నికలు జరగనుందని వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి మాసంలో కాంగ్రెస్ పార్టీ 2 కీలకమైన నిర్ణయాలను తీసుకుంటున్నట్లు కడపలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు. 13 జిల్లాలో ప్రత్యేక హోదా, ప్రజాయాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నట్లు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల దృష్ట్యా అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని వెల్లడించారు.