ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వటపత్రశాయి రూపంలో ఒంటిమిట్ట కోదండరాముడు

శ్రీరామ‌న‌వ‌మి బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా క‌డ‌ప జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామస్వామి వ‌ట‌ప‌త్ర‌శాయి అలంకారంలో కొలువుదీరాడు.

By

Published : Apr 15, 2019, 1:08 PM IST

వటపత్రశాయి రూపంలో ఒంటిమిట్ట స్వామి

వటపత్రశాయి రూపంలో ఒంటిమిట్ట స్వామి

కడప జిల్లా ఒంటిమిట్టలో నవమి వేడుకలు కనుల పండువగా సాగుతున్నాయి. ఉద‌య‌మే స్వామికి ప్ర‌త్యేక పూజ‌లు చేసిన పండితులు... వ‌ట‌ప‌త్రసాయి రూపంలో అలకరించారు. అనంత‌రం ఆల‌య మాఢవీధుల్లో స్వామిని ఊరేగించారు. ఈ సుందర దృశ్యం చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు.

కోదండ‌రాముడు ఈ సాయంత్రం సింహ‌వాహ‌నంపై ఊరేగుతారు. ఈ నెల 18న స్వామివారి క‌ల్యాణోత్స‌వం వైభ‌వంగా నిర్వ‌హించేందుకు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానాధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. 52 ఎక‌రాల విస్తీర్ణంలో క‌ల్యాణ వేదిక‌ సిద్ధం చేస్తున్నారు. క‌ల్యాణమహోత్స‌వాన్ని తిల‌కించేందుకు ల‌క్షమంది భ‌క్తులు వ‌స్తార‌న్న అంచ‌నతో సదుపాయాలు కల్పిస్తున్నారు.

ఇవీ చూడండి......గోదాంలో అగ్రిప్రమాదం- కోట్ల పంట బుగ్గిపాలు....

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details