కడపలో కరోనా పాజిటివ్ కేసులు ఒక్కొక్కటిగా పెరుగుతున్నాయి. మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న కడపలో ఇటీవల బీకేఎం వీధిలో ఒకే కుటుంబంలో నాలుగు పాజిటివ్ కేసులు రావటంతో... దాని ప్రభావం నగరంపై చూపింది. తాజాగా కడప రవీంద్రనగర్లో ఓ ఇంట్లో పాజిటివ్ కేసు నమోదవటంతో...పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.... బాధితుడిని కట్టుదిట్టమైన బందోబస్తు నడుమ 108 వాహనంలో కొవిడ్ ఆస్పత్రికి తరలించారు. ఆ ప్రాంతంలో మరి కొన్ని కేసులు పెరిగే అవకాశాలు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కడప నగరానికి మరింత కట్టుదిట్టం చేశారు. ఈ మేరకు రవీంద్ర నగర్ను రెడ్ జోన్గా ప్రకటించారు.
కడపలో మరో కరోనా పాజిటివ్ కేసు
కడప నగరంలో మరో పాజిటివ్ కోసం వెలుగుచూసింది. దీంతో స్థానిక రవీంద్ర నగర్ను అధికారులు రెడ్జోన్గా ప్రకటించి...కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.
కడపలో మరో కరోనా పాజిటివ్ కేసు