ఉపకార వేతనాలు విడుదల చేయాలని ధర్నా
పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాలను విడుదల చేయాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.
' ఏఐఎస్ఎఫ్' ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా
కడప జిల్లా బద్వేలులో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేపట్టారు. గౌతమ్ కళాశాల నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకూ ప్రదర్శన నిర్వహించారు. అక్కడ మానవహారంగా ఏర్పడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ఏఐఎస్ఎఫ్ ప్రాంతీయ కార్యదర్శి అనిల్ ఆందోళనను పర్యవేక్షించారు.