ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డికి ఫోన్​లో బెదిరింపులు

మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డికి ఓ వ్యక్తి నుంచి బెదిరింపు ఫోన్​కాల్ వచ్చినట్లు సమాచారం. కాల్​ చేసిన వ్యక్తి గుంటూరుకు  చెందిన ఎరవ బాలకృష్ణగా పోలీసులు గుర్తించారు.

By

Published : Jun 15, 2019, 11:01 PM IST

మాజీ మంత్రి ఆదినారాయణ

మాజీమంత్రి ఆదినారాయణరెడ్డికి ఓ వ్యక్తి ఫోన్లో బెదిరించినట్లు సమాచారం. బెదిరించడంతో పాటు భారీ స్థాయిలో నగదును డిమాండ్ చేసినట్లు తెలిసింది . ఈనెల 13వ తేదీ రాత్రి, 14వ తేదీ ఉదయం గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన ఎరువ బాలకృష్ణ మాజీమంత్రికి ఫోన్ చేసి.... 75 లక్షల రూపాయలు నగదు కావాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఆదినారాయణ రెడ్డి అనుచరుడు కిరణ్ ఫిర్యాదు మేరకు జమ్మలమడుగు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details