ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 23, 2020, 4:41 PM IST

Updated : Jan 24, 2020, 8:11 AM IST

ETV Bharat / state

రాజంపేటలో ఆదిలాబాద్​ బాలిక..! అసలేం జరిగింది..?

తెలంగాణలోని ఆదిలాబాద్​కు చెందిన ఓ బాలిక ఇద్దరు వ్యక్తులను నమ్మి... వారితో వెళ్లేందుకు సిద్ధపడింది. ఎందుకో అనుమానమొచ్చి భయంతో పోలీసులను ఆశ్రయించింది. కడప జిల్లా నందలూరు పోలీసులను ఆశ్రయించగా... వారు రాజంపేట ఐసీడీఎస్ బాలసదన్​ అధికారులకు అప్పగించారు.

రాజంపేటలో ఆదిలాబాద్​ బాలిక..! అసలేం జరిగింది..?
రాజంపేటలో ఆదిలాబాద్​ బాలిక..! అసలేం జరిగింది..?

రాజంపేటలో ఆదిలాబాద్​ బాలిక

సునీత, శంకర్ అనే వ్యక్తుల మాటలు నమ్మి... ఆదిలాబాద్​కు చెందిన 14 ఏళ్ల బాలిక వారితో వెళ్లేందుకు సిద్ధపడింది. రైల్లో ప్రయాణిస్తుండగా ఆ బాలికకు అనుమానమొచ్చింది. కడప జిల్లా నందలూరు రైల్వేస్టేషన్​లో పోలీసులను ఆశ్రయించింది. వారు ఆ బాలికను రాజంపేట పట్టణంలోని బాలసదన్​కు తరలించారు. శంకర్, సునీత ఇద్దరూ బంధువులేనని బాధిత బాలిక చెప్పింది. కానీ... తనను ఎక్కడికి తీసుకెళ్లేది చెప్పలేదని వివరించింది. భయమేసి నందలూరు రైల్వేస్టేషన్​లో దిగి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆ బాలిక వెల్లడించింది.

Last Updated : Jan 24, 2020, 8:11 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details