కడపకు చెందిన వ్యక్తి కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడిని సుబ్బారాయుడుగా పోలీసులు గుర్తించారు. కొంత కాలం క్రితమే అతనికి వివాహమైందని.. కుటుంబ కలహాలతో సతమతం అవుతున్నాడని పోలీసులకు కుటుంబీకులు తెలిపారు.
ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని సుబ్బారాయుడు ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.