కడప జిల్లా పులివెందులలో దివంగత నాయకుడు వైఎస్ వివేకానందరెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా వైఎస్ విజయమ్మ, కుటుంబ సభ్యులు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ మనోహర్రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వివేకానంద రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించారు. చర్చిలో విజయమ్మ, కుటుంబ సభ్యులు.. వివేకానంద రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలంటూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
వైఎస్ వివేకానందరెడ్డికి ఘన నివాళి
దివంగంత నేత వైఎస్ వివేకానందరెడ్డి ప్రథమ వర్థంతి సందర్భంగా వైఎస్ విజయమ్మ, కుంటుంబ సభ్యులు, ఎంపీ అవినాష్రెడ్డి తదితరులు నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేశారు. వివేకానందరెడ్డి అడుగుజాడల్లో అందరూ నడవాలని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాష అన్నారు.
A great tribute to YS Vivekananda Reddy at pulivendhula in kadapa
వైఎస్ వివేకానందరెడ్డి లాంటి మనిషి మన మధ్య లేకపోవడం పార్టీకి తీరని లోటని ఉప ముఖ్యమంత్రి అంజాద్బాష అన్నారు. కడప పార్టీ కార్యాలయంలో వివేకా చిత్రపటానికి పూలమాల వేసి.. నివాళులర్పించారు. శత్రువులు లేని ఏకైక నాయకుడు వివేకానందరెడ్డి అని ఉప ముఖ్యమంత్రి అన్నారు. ఆయన అడుగు జాడలో అందరూ నడవాలని కోరారు.