జనసేన పార్టీలోకి ప్రముఖ విద్యావేత్త కె.వి. విష్ణురాజు చేరారు. పవన్ కల్యాణ్ ఆహ్వానం మేరకు పార్టీలో చేరినట్లు విష్ణురాజు తెలిపారు. పార్టీలోకి చేరగానే పార్టీ సలహా మండలి ఛైర్మెన్గా విష్ణురాజును నియమించారు. ఆయన కళాశాల నడిపే విధానం ఎంతగానే నచ్చిందని పవన్ అన్నారు. పార్టీకి మేకింగ్, దిశానిర్దేశం చేయడంలో ఆయన పాత్ర ఉంటుందని జనసేనాని స్పష్టం చేశారు. విష్ణురాజు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన విద్యావేత్త. ప్రముఖ ఎడ్యుకేషన్ సొసైటీ, ఫౌండేషన్, సిమెంట్ సంస్థకు ఛైర్మన్ గా ఉన్నారు.