ఇదీ చూడండి:
'తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటిన నేత ఎన్టీఆర్'
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు 24వ వర్ధంతి నిర్వహించారు. వీరనారాయణ కూడలి వెంకటేశ్వర కూడలిలో ఎన్టీఆర్ విగ్రహాలకు మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ, రాష్ట్ర ఖాదీ బోర్డు మాజీ చైర్మన్ దొమ్మేటి వెంకట్ సుధాకర్, మున్సిపల్ మాజీ ఛైర్మన్ పరిమి వెంకటేశ్వరరావు, పలువురు పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచం నలుమూలల చాటి చెప్పిన ఘనత ఎన్టీ రామారావుదే అని నాయకులు పేర్కొన్నారు.
తణుకులో ఎన్టీఆర్ వర్ధంతి