ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'చేయూత' పొందేందుకు వయసు పెంచుకున్నారు

By

Published : Sep 16, 2020, 4:51 PM IST

వైఎస్సార్ చేయూత పథకాన్ని పొందేందుకు ఆధార్ కార్డుల్లో వయసు మార్చుకున్నారు పశ్చిమగోదావరి జిల్లా రామారావుగూడెంకు చెందిన కొందరు గ్రామస్థులు. విషయం తెలుసుకున్న విజిలెన్స్ & ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు... గ్రామ సచివాలయంలో విచారణ నిర్వహించారు.

Ramarao gudem
Ramarao gudem

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం రామారావుగూడెం సచివాలయంలో విజిలెన్స్ & ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు.. ఆధార్ కార్డుల్లో మార్పుల వ్యవహారంపై విచారణ నిర్వహించారు. వైఎస్సార్ చేయూత పథకానికి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయస్సు ఉన్న వారే అర్హులు. అయితే కొంతమంది ఆధార్​లో వయసును మార్చుకోవడం ద్వారా లబ్ధి పొందడానికి చర్యలు చేపట్టారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లటంతో విజిలెన్స్ & ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు విచారణ చేపట్టారు. ఏలూరులోని ఒకచోట విచారణ చేయగా రామారావు గూడెం గ్రామానికి చెందిన కొందరు ఆధార్ కార్డుల్లో మార్పులు చేయించుకున్నట్లు తేలింది.

ఈ క్రమంలో విజిలెన్స్ సీఐ నాగేశ్వరరావు, ఎఫ్​ఆర్​వో సీతారామ వరప్రసాద్ సిబ్బందితో రామారావుగుడెం గ్రామ సచివాలయంలో బుధవారం విచారణ నిర్వహించారు. వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులను కార్యాలయానికి పిలిపించి ఆధార్, పాన్ ​కార్డులు తనిఖీ చేశారు. కొందరు వయసు పెంచుకోవడానికి చర్యలు చేపట్టిన మాట వాస్తవమేనని అంగీకరించారు. విచారణ నివేదికను పై అధికారులకు అందజేస్తామని అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details