పురాతన చరిత్ర కలిగి ఉన్న పశ్చిమ గోదావరి ఉండ్రాజవరం శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో.. సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
స్థల పురాణం:
పదకొండో శతాబ్దం నుంచి ఈ ఆలయం ఉన్నట్లు చెబుతారు. రాజరాజ నరేంద్రుడు రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్న రోజుల్లో.. ఉరగ రాజు అనే సామంతరాజు ఈ ప్రాంతాన్ని పరిపాలించేవాడు. స్వయంభూ అయిన స్వామివారికి ఉరగరాజు పూజలు చేశారనీ... రాజు పేరు మీదే గ్రామాన్ని ఉరగరాజపురమని పిలిచేవారనీ.. కాలక్రమేణా ఉండ్రాజవరంగా మారిందని చెబుతునారు.