ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇసుక సమస్యను నిరసిస్తూ..తాడేపల్లిగూడెంలో భాజపా భిక్షాటన

ఇసుక సమస్యను నిరసిస్తూ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో భాజపా ఆధ్వర్యంలో భిక్షాటన చేపట్టారు.

By

Published : Oct 7, 2019, 9:14 PM IST

ఇసుక సమస్యపై నిరసన వ్యక్తం చేస్తూ..భిక్షాటన

ఇసుక సమస్యను నిరసిస్తూ..తాడేపల్లిగూడెంలో భాజపా భిక్షాటన

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఇసుక సమస్యను నిరసిస్తూ భాజపా ఆధ్వర్యంలో భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. ఇసుక కొరతపై భవన కార్మికులు తమ నిరసన గళాన్ని వినిపించారు. ప్రధాన రహదారుల వెంట ప్లకార్డులు చేతబూని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు మాట్లాడుతూ... ప్రతి ఒక్క కార్మికుడికి నెలకు పది వేల రూపాయలు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఈ భిక్షాటన ద్వారానైనా ప్రభుత్వం తక్షణమే కళ్లు తెరుస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details