ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 18, 2020, 6:41 PM IST

ETV Bharat / state

దళితులు రాజకీయంగా ఎదగాలి: రవీంద్రబాబు

ఎస్సీ వర్గీకరణ జరిగితే అంబేడ్కర్ ఆశయాలు సమాధి అవుతాయని ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు అన్నారు. అంబేడ్కర్ కల్పించిన సౌకర్యాల ఫలితమే.. నేడు దళితులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు.

దళితులు రాజకీయంగా ఎదగాలి: రవీంద్రబాబు
దళితులు రాజకీయంగా ఎదగాలి: రవీంద్రబాబు

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం పోతునూరులో 14 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన కచేరి సావిడిని ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రవీంద్ర బాబు మాట్లాడారు.

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కల్పించిన సౌకర్యాల ఫలితమే నేడు దళితులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. ఉపాధి అవకాశాలు పెంచుకుంటూ.. రాజకీయంగా ఎదగాలన్నారు. భవన నిర్మాణ దాత నాగేంద్ర వరప్రసాద్​ను సత్కరించారు. అనంతరం గ్రామస్థులు ప్రజాప్రతినిధులను సత్కరించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details