పోలవరం, వెలుగొండ, అవుకు ప్రాజెక్టులపై మంత్రి అనిల్ కుమార్ అధికారులతో సమీక్ష చేపట్టారు. అమరావతిలోని జలవనరుల శాఖ క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ప్రాజెక్టుల పురోగతిపై మంత్రి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తి చేసేందుకు అన్ని వనరులు సమీకరించాలని ఆదేశించారు. గోదావరి వరద పరిస్థితిని అంచనా వేసి నిర్మాణ పనులు చేపట్టాలని సూచించారు.
పోలవరం ప్రాజెక్టు పూర్తికి అన్ని వనరులను సమీకరించండి: మంత్రి అనిల్
పోలవరం ప్రాజెక్ట్ త్వరగా పూర్తిచేసేందుకు అన్ని వనరులు సమీకరించాలని మంత్రి అనిల్కుమార్ అధికారులకు సూచించారు. వివిధ ప్రాజెక్టులపై అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు.
ప్రాజెక్టులపై మంత్రి అనిల్ కుమార్ సమీక్ష