పశ్చిమగోదావరి జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతం నుంచి 1075 కిలోల గంజాయిని కొబ్బరికాయల లోడు లారీలో తరలిస్తుండగా.. పాలకొల్లు మండలం వెలివెల గ్రామంలో పట్టుకున్నారు. దీని విలువ కోటి రూపాయలకు పైగా ఉంటుందని డీఎస్పీ ఆంజనేయులు రెడ్డి తెలిపారు.
పాలకొల్లులో రూ.కోటి విలువైన గంజాయి పట్టివేత - పశ్చిమగోదావరి జిల్లాలో గంజాయి పట్టివేత
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో భారీగా గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ కోటి రూపాయలు ఉంటుందని డీఎస్పీ ఆంజనేయులు రెడ్డి తెలిపారు.

పాలకొల్లు మండలంలో భారీగా గంజాయి పట్టివేత