ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఫిర్యాదు చేస్తే దాడి చేశారు

పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ వ్యవహారంలో అక్రమ వసూళ్లపై ప్రభుత్వ టోల్ ఫ్రీ నంబర్​కు ఫిర్యాదు చేసిన వ్యక్తిపై వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడిన ఘటన పెనుగొండ మండలం సిద్దాంతంలో జరిగింది.

By

Published : Jun 4, 2020, 9:06 AM IST

Assault about complaint for house land corruption in penugonda west godavari district
సిద్దాంతం గ్రామంలో ఫిర్యాదు దారులపై వైకాపా కార్యకర్తల దాడి

అందరికీ ఇళ్లు పథకంలో భాగంగా గ్రామ శివారులోని ఘటాలదిబ్బకు చెందిన గుత్తుల రమేశ్​ భార్య గుత్తుల కల్పన పేరిట స్థలం మంజూరు అయింది. దీనికోసం స్థానిక వైకాపా నాయకులకు మార్చి నెలలో రమేశ్ రూ.50,000 చెల్లించాడు. ఇటీవల జిల్లాలో ఇళ్ల స్థలాల అక్రమాలపై ఫిర్యాదులు రావడంతో జిల్లా కలెక్టర్ ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్​ను ఏర్పాటు చేశారు. కాగా... బాధితుడు గత నెల 30న టోల్ ఫ్రీ నంబర్​కు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు ఈనెల ఒకటో తేదీన స్థానిక తహసీల్దార్ రవికుమార్.. గ్రామానికి వచ్చారు. ఇదే సమయంలో తహసీల్దార్​ను కలిసేందుకు వచ్చిన రమేశ్​పై అక్కడ ఉన్న వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details