ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక అధికారి

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి, పునరావాస కార్యక్రమాల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గూడూరు సబ్ కలెక్టర్​గా పని చేస్తున్న ఓ.ఆనంద్​ను ప్రత్యేక అధికారిగా నియమించింది.

By

Published : Aug 5, 2019, 9:10 PM IST

పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక అధికారి

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలను పరిష్కరించేందుకు, పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిర్వాసితుల సమస్యల పరిష్కరణకు ఐఏఎస్ అధికారిని నియమిస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. గూడూరు సబ్ కలెక్టర్​గా పనిచేస్తున్న ఓ.ఆనంద్​ను పోలవరం ప్రాజెక్టు ప్రత్యేక అధికారిగా బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details