ఆంధ్రప్రదేశ్

andhra pradesh

250 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత.. లారీ డ్రైవర్ అరెస్ట్

By

Published : Jan 21, 2021, 9:34 AM IST

పేద ప్రజలకు అందించే రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. తెలంగాణలోని ఖమ్మం నుంచి లారీలో కాకినాడకు వెళ్తున్న అక్రమార్కులను గుర్తించి.. అడ్డుకున్నారు.

250 quintals ration  rice confiscation
250 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం కలపర్రులో రేషన్‌ బియ్యం అక్రమ తరలింపును విజిలెన్స్‌ అధికారులు అడ్డుకున్నారు. తెలంగాణలోని ఖమ్మం నుంచి లారీలో కాకినాడకు 250 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని తరలిస్తున్నారన్న సమాచారం మేరకు.. విజిలెన్స్‌ అధికారులు కలపర్రు టోల్‌గేట్‌ వద్ద తనిఖీలు నిర్వహించారు. లారీతో సహా చౌక‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. లారీ డ్రైవర్​ను అరెస్ట్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details