విజయనగరం జిల్లాలో డిసెంబర్ 7 నుంచి 21 వరకు పారిశుద్థ్య పక్షోత్సవాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా. ఎం. హరిజవహర్ లాల్ అన్నారు. పారిశుద్థ్య పక్షోత్సవాలను ప్రజలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు భాగస్వాములైతేనే ఆయా గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపడుతుందన్నారు. ప్రతి మండలంలో ఎంపిక చేసిన పది గ్రామాల్లో పారిశుద్థ్య పక్షోత్సవాలు జరగనున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. మండల ప్రత్యేకాధికారులతో కలెక్టర్ కార్యాలయంలో 'మనం-మన పరిశుభ్రత'పై కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
'పారిశుద్థ్య పక్షోత్సవాలను విజయవంతం చేయాలి'
పారిశుద్థ్య పక్షోత్సవాలను విజయవంతం చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. డిసెంబర్ 7 నుంచి 21 వరకు జరిగే పారిశుద్థ్య పక్షోత్సవాల్లో ప్రజలు పాల్గొనాలని కోరారు.
గ్రామాల్లో తడి చెత్త, పొడిచెత్త విడిగా సేకరించడం వంటి అంశాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ పక్షోత్సవాల్లో భాగంగా గ్రామాల్లో పిచ్చిమొక్కలు తొలగించడం, డ్రెయిన్లలో పూడిక, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడం వంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పారిశుద్ధ్య పక్షోత్సవాలపై రూపొందించిన కరపత్రాలు, పోస్టర్లను కలెక్టర్ డా. హరిజవహర్ లాల్ ఆవిష్కరించారు.
ఇదీ చదవండి: పర్యాటక స్వర్గధామం విశాఖ మన్యం..ప్రత్యేకతలు ఏంటంటే