విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కరకవలసలో విషాదం చోటు చేసుకుంది. వాలీబాల్ ఆడుతున్న సమయంలో పిడుగు పాటుకు గురై ఇద్దరు యువకులు మృతి చెందారు. గ్రామానికి చెందిన ప్రేమకుమార్, వెలగాడ శివ... స్నేహితులతో కలిసి సాయంత్రం వాలీబాల్ ఆడుతుండగా పిడుగు పడింది. ఈ ఘటనలో వీరిద్దరూ అక్కడికక్కడే మృతి చెందగా... మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రున్ని వెంటనే విజయనగరం ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఒకరైన ప్రేమకుమార్కు ఆరు నెలల క్రితమే వివాహం జరగ్గా... అతని భార్య ప్రస్తుతం మూడు నెలల గర్భిణీ. మరో మృతుడైన శివ...వారి తల్లిదండ్రులకు ఏకైక కుమారుడు. ఇటీవలే అతని తండ్రి మరణించారు. వాలీబాల్ ఆడుతున్న యువకులను పిడుగు కబళించడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.