ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పిడుగుపాటుకు ఇద్దరు మృతి...మరో ముగ్గురికి గాయాలు

పిడుగుపాటుకు గురై ఇద్దరు మృతి చెందగా..మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుల్లో 4 నెలల పసికందు ఉన్నాడు. ఈ ఘటన విజయనగరంలోని  ఆంధ్రా ఒడిశా సరిహద్దులో చోటు చేసుకుంది.

By

Published : Jun 3, 2019, 5:33 AM IST

Updated : Jun 3, 2019, 10:50 AM IST

పిడుగుపాటు ఇద్దరు మృతి మృతి...మరో మగ్గురికి గాయాలు

పిడుగుపాటు ఇద్దరు మృతి మృతి...మరో మగ్గురికి గాయాలు

పొలం పనులకు వెళ్లిన గిరిజనులపై పిడుగుపడిన ఘటన విజయనగరంలోని ఆంధ్రా ఒడిశా సరిహద్దు ప్రాంతంలో విషాదం నింపింది. ఊహించని ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందగా.. 4 నెలల పసికందు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నాడు. ఒడిశాలోని కొరాపుట్ జిల్లా నారాయణపురం తాలూకాలో కిమిడిభద్ర గ్రామానికి చెందిన కొంతమంది గిరిజనులు వ్యవసాయ పనులకు వెళ్లారు. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతం కాగా వారంతా ఇంటిదారి పట్టారు. అంతలోనే పిడుగు పడి ఇద్దరి ప్రాణాలను బలిగొంది. రాధ, సునీత అనే ఇద్దరు మహిళలు పిడుగుపాటుకు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు మహిళల పరిస్థితి విషమంగా ఉండగా... 4 నెలల పసికందు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఒకే కుటుంబంలో ఇద్దరు మహిళలు మృతి చెందిన ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Last Updated : Jun 3, 2019, 10:50 AM IST

ABOUT THE AUTHOR

...view details