ప్రభుత్వ తీరుతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలిసేలా.. విజయనగరం జిల్లా తెదేపా నేతలు కరపత్రాలు రూపొందించారు. వాటిని పార్టీ నేత అదితి గజపతిరాజు విడుదల చేశారు. నిత్యావసర సరకుల ధరలు పెరుగుతుంటే ప్రభుత్వం పట్టింపు లేకుండా ఉందని విమర్శించారు. విద్యుత్ బిల్లుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు.