విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం చిన్న పల్లికి చెందిన రైతు ఆవు కాన్పు సమయంలో దూడ అడ్డంగా తిరిగింది. రైతు చీపురుపల్లి ప్రభుత్వ పశువుల ఆసుపత్రిలో డాక్టర్ ను సంప్రదించారు. వారు గరివిడి వెంకటేశ్వర పశువైద్య పరిశోధన కేంద్రానికి రిఫర్ చేశారు. వైద్యులు తగు పరీక్షలన్నీ చేసి లోపల దూడ చనిపోయిందని గ్రహించి ఆవుకు ఆపరేషన్ చేసి చనిపోయిన దూడను బయటకు తీశారు. పశువుల ప్రసవ సమయంలో యజమానులు వైద్యశాలకు తీసుకువెళ్లాలని పరిశోధన కేంద్రం అసోసియేట్ డీన్ నాయుడు తెలిపారు. అందువల్ల వాటికి ఎలాంటి హాని ఉండదని సూచించారు.
పశుపరిశోధన కేంద్రంలో అరుదైన చికిత్స
విజయనగరం జిల్లా గరివిడిలోని శ్రీ వెంకటేశ్వర పశు వైద్య పరిశోధన కేంద్రంలో అరుదైన చికిత్స చేశారు.
శస్త్ర చికిత్స