ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 4, 2021, 6:52 PM IST

ETV Bharat / state

సర్వీస్ రోడ్డును మూసివేయాలని విద్యార్థుల ఆందోళన

పాఠశాలకు ఆనుకోని ఉన్న జాతీయ రహదారి సర్వీస్ రోడ్డును తక్షణమే మూసివేయాలని బోగాపురం మండలం మహారాజు పేట విద్యార్థులు ఆందోళనకు దిగారు. సమస్యను పరిష్కరించే వరకు ప్రతి రోజు నిరసనలు చేపడతామని వారు తెలిపారు.

సర్వీస్ రోడ్డును మూసివేయాలని విద్యార్థుల ఆందోళన
సర్వీస్ రోడ్డును మూసివేయాలని విద్యార్థుల ఆందోళన

విజయనగరం జిల్లా భోగాపురం మండలం మహారాజుపేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. పాఠశాలకు ఆనుకోని ఉన్న జాతీయ రహదారి సర్వీస్ రోడ్డును తక్షణమే మూసివేయాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికే ఈ విషయంపై తమ తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఎదుట మెురపెట్టుకున్నా ఎవరు పట్టించుకోలేదని పాఠశాల కమిటీ ఛైర్మన్ సూరిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ రహదారి అధికారులకు అనేకమార్లు విన్నవించిన ఫలితం లేకపోయిందని...ఎవరూ స్పందించకపోవటంతో రహదారిపై నిరసన చేపట్టాల్సి వచ్చిందని తెలిపారు. తమ సమస్య పరిష్కారం అయ్యేంతవరకు ప్రతిరోజు ఇలా నిరసనలు చేపడతామని వారంతా స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details