ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 10, 2020, 9:12 PM IST

ETV Bharat / state

కోవిడ్ కట్టడికి ప్రధానంగా 3 సూత్రాలు పాటించాలి

కరోనా వైరస్​ను నియంత్రించేందుకు తప్పనిసరిగా మాస్కును ధరించాలని విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి కోరారు. జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన గోడ పత్రికను ఎస్పీ పోలీసు కార్యాలయంలో ఆవిష్కరించారు.

corona virus at vizianagaram
విజయనగరం జిల్లాలో కరోనా

కరోనా వైరస్​ను నియంత్రించేందుకు తప్పనిసరిగా మాస్కును ధరించాలని విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి కోరారు. జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన గోడ పత్రికను ఎస్పీ పోలీసు కార్యాలయంలో ఆవిష్కరించారు. కరోనా కేసుల సంఖ్య జిల్లాలో పెరుగుతున్నందున మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కోవిడ్ కట్టడికి ప్రధానంగా 3 సూత్రాలు పాటించాలని..ముఖానికి మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజరుతో చేతులను శుభ్రం చేసుకోవాలన్నారు. ఇప్పటికే పోలీసుశాఖ ఆధ్వర్యంలో కరోనా నియంత్రణ చర్యలు గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details