ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాహుల్ వస్తేనే... ఏపీ బాగుపడుతుంది: రఘువీరా రెడ్డి

విజయనగరం జిల్లా నెల్లిమర్లలో ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని... ప్రజల ఆలోచనలకు తగ్గట్టు కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోందని రఘువీరా అన్నారు. ప్రత్యేక హోదాతో రాష్ట్రంలోని యువత భవిష్యత్తును బాగు చేస్తామన్నారు.

By

Published : Apr 2, 2019, 7:30 PM IST

రఘువీరా రెడ్డి

రఘువీరా రెడ్డి
విజయనగరంజిల్లా నెల్లిమర్లలో ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నెల్లిమర్ల శాసనసభ అభ్యర్థి రమేష్ కుమార్, విజయనగరం ఎంపీ అభ్యర్థి యడ్ల ఆదిరాజు తరఫున ఓట్లు అభ్యర్థించారు. దేశప్రజలు మార్పు కోరుకుంటున్నారని... ప్రజల ఆలోచనలకు తగ్గట్టు కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోందని రఘువీరా అన్నారు. ఈ మేరకు భవిష్యత్తులో 6శాతం నిధులు విద్యకు కేటాయించడానికి రాహుల్ గాంధీ ఆలోచిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా నెలకు ఆరువేల రూపాయలు పేదవారికి ఇస్తామని హామీ ఇచ్చారు.ప్రత్యేక హోదాతో రాష్ట్రంలోని యువత భవిష్యత్తును బాగు చేస్తామన్నారు. ప్రత్యేక హోదా రాకపోతే రాష్ట్రం అంధకారం అవుతుందన్నారు. రాహుల్ ప్రధాని అయితేనే సమస్యలు పరిష్కారం అవుతాయని... ఇందుకు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details