ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 6, 2021, 5:25 PM IST

ETV Bharat / state

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న కారు.. ఒకరు మృతి

విజయనగరం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. కారు ఢీ కొట్టడంతో ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

road accident
ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న కారు ఒకరి మృతి

విజయనగరం జిల్లా జామి మండలం భీమసింగి ఫ్లై ఓవర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై విజయనగరం వైపు ప్రయాణిస్తున్న మిడతాన దేవుడు (43) అనే వ్యక్తిని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో దేవుడు.. అక్కడికక్కడే మృతి చెందాడు.

ఎల్​ఐసీ ఏజెంట్​గా పనిచేసిన దేవుడు... మండలంలోని అలమండ గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంపై... సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details