ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెండున్నర కిలోల బంగారం పట్టివేత

విజయనగరం జిల్లా కేంద్రంలో పంజాబ్​కు చెందిన ఇద్దరు వ్యక్తుల నుంచి సుమారు రెండున్నర కిలోల బంగారాన్ని జిల్లా సీసీఎస్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

By

Published : Mar 24, 2019, 8:30 PM IST

రెండున్నర కిలోల బంగారం పట్టివేత

విజయనగరంలో రెండున్నర కిలోల బంగారం పట్టివేత
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విజయనగరం పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. జిల్లా కేంద్రంలోఇవాళ చేపట్టిన సోదాల్లో సుమారు రెండున్నర కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని గంటస్తంభం వద్ద అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న బ్యాగ్​ల నుంచి సుమారు రెండున్నర కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారానికి సంబంధించిన సరైన ధృవపత్రాలు చూపనందున వారిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్​లోని అమృత్​సర్ వాసులుగా గుర్తించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details