ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుదాఘాతంతో రైస్ మిల్లులో మంటలు

విజయనగరం జిల్లా ఉద్దవోలులోని ఓ బియ్యం మిల్లులో విద్యుదాఘాతంతో అగ్ని ప్రమాదం జరిగింది. సుమారు 15లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నారు.

By

Published : Jul 6, 2019, 1:42 PM IST

అగ్నిప్రమాదం

విద్యుదాఘాతంతో రైస్ మిల్లులో మంటలు

విజయనగరంజిల్లా గరుగుబిల్లి మండలం ఉద్దవోలులో కల్కి మోడ్రన్ బియ్యం మిల్లులో విద్యుదాఘాతంతో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదాన్ని గుర్తించేలోపే మంటలు మిల్లు మొత్తం వ్యాపించి ధాన్యంతో పాటు, నూకలు, బియ్యం, తవుడు, గోనెసంచులు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపుచేయటంతో భారీనష్టం తప్పింది. ప్రమాదంలో సుమారు 15లక్షల రూపాయల మేర నష్టం జరిగినట్టు అధికారుల అంచనా వేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details