లాక్డౌన్ సమయంలో ప్రజలంతా ఇళ్లల్లోనూ ఉండాలంటూ విజయనగరం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ శంకరరావు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప.. బయటకు రావద్దని హితవు పలికిన ఆయన.. ఇంట్లోనే క్షవరం చేయించుకున్న ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. తన సతీమణి స్వర్ణలత హెయిర్ కట్ చేసిన ఫొటోతో లాక్డౌన్ పాటించాలనే.. సందేశాన్ని చాటారు. జనాలు... భౌతిక దూరాన్ని విస్మరిస్తున్నారని.. అలా చేయటం ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందని శంకరరావు హెచ్చరించారు.
భార్యతో హెయిర్ కట్ చేయించుకున్న మాజీ ఎంపీ
కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న నేపథ్యంలో ఒక్కొక్కరూ.. ఒకలా ప్రజలకు సందేశాలిస్తున్నారు. ఇంట్లో ఉండి ప్రాణాలు కాపాడుకోవాలంటూ సూచిస్తున్నారు. తాజాగా ఓ మాజీ ఎంపీ తన సతీమణితో క్షవరం చేయించుకున్నారు.
ex mp wife hair cutting at home