ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 16, 2021, 2:55 PM IST

ETV Bharat / state

విజయనగరం జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్

విజయనగరం జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. చీపురుపల్లిలో వ్యాక్సిన్ ప్రక్రియను మంత్రి బొత్స ప్రారంభించారు.

విజయనగరం జిల్లాలో కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్
విజయనగరం జిల్లాలో కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్

చీపురుపల్లి సామాజిక ఆసుపత్రిలో కొవిడ్ వ్యాక్సినేషన్​ కార్యక్రమాన్ని మంత్రి బొత్స ప్రారంభించారు. ఆయనతోపాటు ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, కలెక్టర్ హరిజవహర్‌లాల్‌, వైద్య ఆరోగ్య సిబ్బంది ఉన్నారు.

ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని ఎమ్మెల్యే జోగారావు అన్నారు. పార్వతీపురంలో అర్బన్ హెల్త్ సెంటర్ వద్ద కొవిడ్​ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. స్టాఫ్​నర్స్ పుష్పలతకు డాక్టర్ సంతోష్ కుమారి తొలి వ్యాక్సిన్ ఇచ్చారు.

పాచిపెంట మండలం గురువు నాయుడుపేట గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎమ్మెల్యే రాజన్న దొర వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.

ఇదీ చదవండి:రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రారంభం.. మెుదటి టీకా ఆమెకే!

ABOUT THE AUTHOR

...view details