ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 10, 2020, 4:46 PM IST

ETV Bharat / state

అజాగ్రత్త బలికొన్న ప్రాణం...

కాస్త అజాగ్రత్త నిండు ప్రాణం బలితీసుకుంది. విధి నిర్వహణలో ఉన్న సచివాలయ లైన్​మన్​ విద్యుత్​ షాక్​కు గురై మృతి చెందాడు. విజయనగరం జిల్లా కురుపాం మండలంలో ఈ ఘటన జరిగింది.

linemen lakshmanrao
లైన్​మెన్ లక్ష్మణ్ రావు పాతచిత్రం

విజయనగరం జిల్లా కురుపాం మండలం నీలకంఠాపురం సచివాలయ పరిధిలో.. లైన్​మన్ గా పని చేసిన లక్ష్మణ్ రావు.. కరెంట్​ షాక్​ తగిలి మరణించాడు. విద్యుత్​ అంతరాయాన్ని సరిచేసేందుకు సరఫరా నిలిపేయకుండా.. ఎటువంటి రక్షణ సాధనాలు ధరించకుండా ప్రయత్నించిన సమయంలోనే.. ప్రమాదం జరిగిందని సంబంధిత అధికారులు తెలిపారు.

జాగ్రత్తలు తీసుకుని ఉంటే ప్రాణాపాయం నుంచి బయటపడేవారని అన్నారు. మండలంలోని లంకజోడు గ్రామానికి చెందిన లక్ష్మణరావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విద్యుత్​ అధికారులు మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details