విశాఖ జిల్లాలోని దేవరాపల్లి, చోడవరం, నర్సీపట్నం మండలాల్లో రైతుల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్ జలకళ పథకం వాహనాలను స్థానిక ఎమ్మెల్యేలు లాంఛనంగా ప్రారంభించారు.
దేవరాపల్లి
వ్యవసాయ రంగం అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం వైఎస్సార్ జలకళ పథకాన్ని రూపకల్పన చేసిందని ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు అన్నారు. దేవరాపల్లి, తారువ గ్రామాల్లో వైఎస్సార్ జలకళ పథకం రిగ్గు వాహనాన్ని ఆయన ప్రారంభించారు. మహిళలు, రైతులు రిగ్గు వాహనానికి హారతులతో స్వాగతం పలికారు. సన్న, చిన్నకారు రైతులకు ఈ పథకం వరమని ఆయన పేర్కొన్నారు. ఈ పథకం పొందేందుకు రైతులు.. గ్రామ సచివాలయంలో దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
చోడవరం
వైఎస్సార్ జలకళ కార్యక్రమాన్ని చోడవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే ధర్మశ్రీ శ్రీకారం చుట్టారు. చోడవరం, బుచ్చయ్యపేట, రావికమతం మండల కేంద్రాల్లో ఎమ్మెల్యే రిగ్ను ప్రారంభించారు. వ్యవసాయ భూములకు సాగునీరు అందించాలన్నది ముఖ్యమంత్రి జగన్ ఆశయమని ఆయన తెలిపారు. వర్షాధార భూములు కలిగిన రైతులందరూ జలకళను ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
నర్సీపట్నం
పెద్ద బొడ్డేపల్లి వైకాపా కార్యాలయం వద్ద వైఎస్సార్ జలకళ వాహనాన్ని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ లాంఛనంగా ప్రారంభించారు. రైతాంగానికి ప్రయోజనం చేకూర్చే విధంగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆయన అన్నారు. పాదయాత్రలో ముఖ్యమంత్రి ఇచ్చి హామీల్లో భాగంగా రైతాంగానికి ప్రయోజనం చేకూర్చే విధంగా పథకాలను రూపకల్పన చేసి అర్హులకు అందజేస్తున్నామని పేర్కొన్నారు.
ఇదీ చదవండీ :
గ్రామాల్లో వైఎస్సార్ జలకళ వాహనం పర్యటన