ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 21, 2020, 5:40 PM IST

ETV Bharat / state

'సీఎం జగన్​కు లభిస్తున్న ఆదరణ తట్టుకోలేకే తెదేపా ఆరోపణలు'

ముఖ్యమంత్రి జగన్​కు ప్రజల్లో లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక తెదేపా నేతలు అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారన్నారు ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేశ్. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలను అందించిన ఘనత సీఎం జగన్​కు దక్కుతుందని చెప్పారు.

ycp mla ganesh
ycp mla ganesh

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే ప్రజలకిచ్చిన 90 శాతం హామీలను నెరవేర్చిందని విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేశ్ అన్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్​కు ప్రజల్లో లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక తెదేపా నేతలు అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలను అందించిన ఘనత సీఎం జగన్​కు దక్కుతుందని అన్నారు. తెదేపా రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కించుకోవటం కోసం మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వైకాపా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేశ్ పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details